Share News

420 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:20 AM

ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధంగా ఉంచిన 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాలమిడి పంచాయతీ పెద్దపాడు గ్రామాన్ని తన సిబ్బందితో ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. అక్కడ పసుపుదొడ్లు వద్ద కొన్ని బస్తాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించారు.

 420 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో సీఐ రమేశ్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ రావు, సిబ్బంది

ఐదుగురి అరెస్టు

జి.మాడుగుల, ఏప్రిల్‌ 28: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలించడానికి సిద్ధంగా ఉంచిన 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాలమిడి పంచాయతీ పెద్దపాడు గ్రామాన్ని తన సిబ్బందితో ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. అక్కడ పసుపుదొడ్లు వద్ద కొన్ని బస్తాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించారు. అందులో 420 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీనిని నిల్వ చేసిన పెద్దపాడు గ్రామానికి చెందిన పాంగి పెద్దబ్బాయి, పాంగి శివయ్య, పాంగి సుబ్బారావు, పాంగి వెంకటరావు, పాంగి రాములకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Apr 29 , 2024 | 12:20 AM