Share News

అభివృద్ధిని కాంక్షించిన వారినే ఎన్నుకోవాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:46 PM

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు సంక్షేమం కోరే వాడై ఉండాలి. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజల్లో ఒకడై ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకోవాలి. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి. గెలిచిన తర్వాత ప్రజలను పక్కన పెట్టకుండా ఆపదలో ఆదుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రం నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేవాడే అసలైన ప్రజా ప్రతినిధి. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడినే ఎన్నుకోవాలి.

  అభివృద్ధిని కాంక్షించిన వారినే ఎన్నుకోవాలి

జి.సిగడాం: ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు సంక్షేమం కోరే వాడై ఉండాలి. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజల్లో ఒకడై ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకోవాలి. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి. గెలిచిన తర్వాత ప్రజలను పక్కన పెట్టకుండా ఆపదలో ఆదుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రం నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేవాడే అసలైన ప్రజా ప్రతినిధి. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడినే ఎన్నుకోవాలి.

-మక్క దివాకర్‌, పెంట,

జి.సిగడాం మండలం

Updated Date - Apr 28 , 2024 | 11:46 PM