Share News

మద్యం మత్తులో యువకుల వీరంగం

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:32 AM

మద్యం మత్తు లో యువకుల మధ్య చోటుచేసు కున్న వివాదం ఒక యువకుడికి కత్తిపోట్ల వరకు వెళ్లింది.

మద్యం మత్తులో యువకుల వీరంగం
చికిత్స పొందుతున్న రాము

- ఒకరికి కత్తి పోట్లు

పొందూరు: మద్యం మత్తు లో యువకుల మధ్య చోటుచేసు కున్న వివాదం ఒక యువకుడికి కత్తిపోట్ల వరకు వెళ్లింది. ఎస్‌ఐ వై.రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రం పొం దూరులోని ఎరుకుల కాలనీకి చెందిన గేదెల రాముకి పొందూరు పట్టణానికి చెందిన సిరిపురపు ఈశ్వరరావు, వాసు, చక్రి మధ్య డబ్బుల విషయంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో గొడవ జరిగింది. వీరి మధ్య మాటామాటా పెరిగి రాముపై కత్తితో కడుపులో పొడి చారు. దీంతో తీవ్రంగా గాయపడిన రామును కుటుంబసభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. గేదెల రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:32 AM