సుగర్ ఫ్యాక్టరీని మూయించిన తమ్మినేనికి బుద్ధి చెప్పండి
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:26 AM
జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు స్థాపించిన చక్కెర కర్మాగారాన్ని మూసి వేయించిన స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఈ ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్పా లని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వర రావు అన్నారు.
ఆమదాలవలస: జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు స్థాపించిన చక్కెర కర్మాగారాన్ని మూసి వేయించిన స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఈ ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్పా లని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వర రావు అన్నారు. సోమవారం ఆమదాల వలస వన్వే జంక్షన్ వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సనపల అన్నాజీరావు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యకర్తలు, అభిమానులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి నారా యణరావు, కమ్యూనిస్టు నాయకులు బవిరి కృష్ణమూర్తి, బొడ్డేపల్లి మోహన్రావు, పి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.