ఒకటో తేదీనే పెన్షన్లు చెల్లించాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:55 PM
సామాజిక భద్రతా పెన్షన్లు ప్రతినెలా ఒకటో తేదీన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కోటబొమ్మాళిలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు.
టెక్కలి: సామాజిక భద్రతా పెన్షన్లు ప్రతినెలా ఒకటో తేదీన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కోటబొమ్మాళిలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీలో కావాలనే నిర్లక్ష్యం చేస్తూ పింఛన్దారులకు ఇబ్బందులు కలిగిస్తూ దీనిని ఎదుటి వారిపై తోసేస్తున్నారని టీడీపీ నాయకులు కింజరాపు వరప్రసాద్ అన్నారు. కార్యక్ర మంలో వెలమల విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, నంభాళ్ల శ్రీనివాస్, వెలమల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.