11న జాతీయ లోక్అదాలత్
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:25 AM
స్థానిక కోర్టుల సముదాయంలో మే 11న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి తెలిపారు.
టెక్కలి: స్థానిక కోర్టుల సముదాయంలో మే 11న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి తెలిపారు. సోమవారం కోర్టు సముదా యంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ కార్యక్ర మం చేపడుతున్నామన్నారు. రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులను ఇరు పార్టీల అంగీకారంతో పరిష్కరించనున్నా మన్నారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. సమా వేశంలో బార్ అసోసి యేషన్ అధ్య క్షుడు డి.వివేకానంద, పలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు.