చంద్రబాబు సమక్షంలో పలువురి చేరిక
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:28 AM
ప్రజాగళం కార్యక్రమానికి పలాస వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పలువురు వైసీపీ, బీజేపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరారు.
పలాస/పలాసరూరల్/మందస/వజ్రపుకొత్తూరు/హరిపురం/టెక్కలి: ప్రజాగళం కార్యక్రమానికి పలాస వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పలువురు వైసీపీ, బీజేపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పలాస-కాశీబుగ్గ మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్, వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్, ఆయన సతీమణి, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ, మందస మండ లానికి చెందిన బీజేపీ నాయకుడు కొర్ల కన్నారావు, టెక్కలి మండలం వైసీపీ మాజీ అధ్యక్షుడు, అయోధ్యపురం సర్పంచ్ బగాది హరి, సంత బొమ్మాళి మండ లం యామాలపేట సర్పంచ్ సంజీవ్ కుమార్ తది తరులకు చంద్రబాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు.