Share News

గురుకులాల్లో మిగులు సీట్లకు కౌన్సిలింగ్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:31 AM

గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల కోసం కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి ఎస్‌.బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

గురుకులాల్లో మిగులు సీట్లకు కౌన్సిలింగ్‌

గుజరాతీపేట, ఏప్రిల్‌ 15: గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల కోసం కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి ఎస్‌.బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని డా.బిఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు మొదటి లిస్టులో కేటాయించిన విషయం తెలిసిందే. మిగులు సీట్లకు ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్‌ లిస్టు ప్రకారం ఈ నెల 18న దుప్పలవలస గురుకుల పాఠశాల(బాలురు), 19న పెద్దపాడు గురుకుల పాఠశాలలో ఉదయం పది గంటలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మెరిట్‌లో ఉన్న విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:31 AM