Share News

వైసీపీ అరాచకాలను అంతమొందించాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:01 AM

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను రానున్న ఎన్నికలలో ప్రజలు అంతమొందించాలని వై.పాలెం టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

వైసీపీ అరాచకాలను అంతమొందించాలి

పెద్దారవీడు, ఏప్రిల్‌ 28: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను రానున్న ఎన్నికలలో ప్రజలు అంతమొందించాలని వై.పాలెం టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని కొండారెడ్డికాలనీ, రాజంపల్లి, చట్లమిట్ల, వైడీపాడు గ్రామాలలో ఆదివారం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతోనే ఏపీలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ రూ.15వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆడబిడ్డ నిధి కింద 15 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500లు, దీపం పేరుతో ఏడాదికి 3 ఉచిత సిలెండర్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ జడ్డా రవి, తదితరులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : మండల కేంద్రం త్రిపురాంతకంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన 9 ఎస్సీ కుటుంబాలు, నాగరాజు కాలనీకి చెందిన 20 ఎస్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. ఎర్రగొండపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ పాలనలో అపార అనుభవమున్న చంద్రబాబునాయుడిపై నమ్మకంతో ప్రతి ఒక్కరూ టీడీపీకి ఆకర్షితులవుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు పి.అంజిరెడ్డి, బాలనాసర్‌, చెన్నయ్య, బుజ్జి పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : రాష్ట్రం లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అందరు సైకిల్‌గుర్తుపై తనకు ఓటు వేసి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలన్నారు. ఎర్రగొండపాలెంలోని ఆంజనేయస్వామి కల్యాణమండపంలో ఆదివారం జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయసమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న ఆర్యవైశ్యులకు అండగా ఉండి స్వేచ్చగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సహకారం అంది స్తామన్నారు. మనం ఇక్కడ టీడీపీని గెలిపించుకుంటే మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయించుకుంటామని, వెలిగొండప్రాజెక్టును పూర్తి చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎరిక్షన్‌బాబు కుమార్తె గూడూరి చెల్సియా, కుమారుడు అజిత్‌లు ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ సభకు త్రిపురాంతకం దేవస్థానం మాజీ అధ్యక్షులు గోళ్ల సుబ్బారావు, చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు అనుమాలశెట్టిసుబ్బారావు, ఆర్యవైశ్యనాయకులు చీదెళ్ల నాగేశ్వరరావు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, ఆతుకూరి కృష్ణయ్య, కొల్లా పుల్లారావు, పాల్గొని ప్రసంగించారు. పట్టణంలోని ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : టీడీపీ కూటమి అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు (నాన్నకు ) సైకిల్‌గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కుమార్తె చెల్సి యా, కుమారుడు అజిత్‌లు చేస్తున్న ఎన్నికల ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఆది వారం సాయత్రం పెద్ద మసీదు వద్ద ముస్లిం పెద్దలతో కలసి ఎరిక్షన్‌బాబు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని నమాజ్‌ చేశారు. ఆది వారం సాయంత్రం 100మంది కార్యకర్తలు, నాయకులతో కలసి పెద్దమసీదు బజారు, పుల్లమ్మచేను, చింతపల్లి బజారులలో టీడీపీ అభ్య ర్థి కుమార్తె చెల్సియా ఎన్నికల ప్రచారం చేశారు.

Updated Date - Apr 29 , 2024 | 01:01 AM