Share News

వెలిగొండతోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:05 AM

వెలిగొండ ప్రాజె క్టు పూర్తయితేనే సాగు, తాగునీరు అందు తుందని వెలిగొండ ప్రాజెక్టుతోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందని మార్కా పురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారా యణరెడ్డి అన్నారు.

వెలిగొండతోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి

తర్లుపాడు, ఏప్రిల్‌ 28: వెలిగొండ ప్రాజె క్టు పూర్తయితేనే సాగు, తాగునీరు అందు తుందని వెలిగొండ ప్రాజెక్టుతోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందని మార్కా పురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారా యణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్జ పేట, చెన్నారెడ్డిపల్లె, తర్లుపాడు, రాగి సము ద్రం, కలుజువ్వల పాడులో కందుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ప్రజల ను మోసం చేసేందుకు ప్రాజెక్టు పూర్తి కాకుండానే శిలాఫలకాలు వేసుకొని ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండేళ్ల లోపు పూర్తిగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మార్కాపురం జిల్లా చేయకుండా వైసీపీ నాయకులు కుట్రలు చేశారన్నారు. మార్కాపురం జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి అవుతుందన్నారు. గతంలో చంద్రబా బు జిల్లా చేస్తారని హామీ ఇచ్చారన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే మార్కాపురం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా నని కందుల అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు వివరించారు. ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి జిల్లాలో గత 35 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రస్తుత వైసీపీ ఎంపీ అభ్యర్థి బాగోతం ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు, మాగుంట శ్రీనివాసులరెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ ఉపాఽధ్యక్షులు కంచెర్ల కాశయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావి బాసపతిరెడ్డి, మాజీ ఎంపీపీ పి.ఏసుదాసు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పి.గోపినాథ్‌ చౌదరి, నాయకులు రోశప్ప నాయుడు, గుర్రపుసాల నరసింహు లు, జి.సుబ్బయ్య, ఈర్ల వెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు, ఆరికట్ల వెంకటేశ్వరెడ్డి, జనసేన పార్టీ మండలాధ్యక్షులు సేతుల శ్రీనివాసులు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గాయం లక్ష్మీరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొదిలి :మండలంలోని కంభాల పాడు గ్రామంలో పది కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మార్కాపురం మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో జరుగు తున్న ఇంటింటికి మన కందుల కార్యక్రమంలో వీరు కందుల నారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో చేశారు. రైతు సంఘ రాష్ట్ర నాయకులు ఆవులూరి యలమంద ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి కందుల నారాయణరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి, యువతకు భరోసా ఉంటుందన్నారు. కనుక తనను, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కంభాలపాడు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 01:05 AM