Share News

వైసీపీని వీడి టీడీపీలోకి..

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:32 AM

ఒంగోలు నగరానికి చెందిన కాపు నాయకులు దమ్మాలపాటి రమేష్‌, చెన్నంశెట్టి రాంబాబు, వారి అనుచరులు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు సోమవారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు.

వైసీపీని వీడి టీడీపీలోకి..
దామచర్లతో కాపు నాయకుడు దమ్మాలపాటి రమేష్‌ తదితరులు

కూటమి అభ్యర్థి దామచర్లతో కాపు నేతల భేటీ

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 15 : ఒంగోలు నగరానికి చెందిన కాపు నాయకులు దమ్మాలపాటి రమేష్‌, చెన్నంశెట్టి రాంబాబు, వారి అనుచరులు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు సోమవారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. రాష్ట్ర కాపు నాయకులుగా ఉన్న దమ్మాలపాటి రమేష్‌, చెన్నంశెట్టి రాంబాబులు ఇప్పటివరకు వైసీపీలో కొనసాగారు. అయితే త్వరలోనే తాము, తమ అనుచరులు టీడీపీలో చేరనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలాఉండగా వారి చేరికకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన దామచర్ల అన్నివర్గాల నాయకులు తమ పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. కాపు సామాజికవర్గం నుంచి ముఖ్యులైన వారందరి చేరికలతో టీడీపీ బలం మరింత పెరిగిందన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి, టీడీపీ కూటమి గెలుపు కోసం కృషిచేయాలని కోరారు. ఆర్యవైశ్య నాయకులు సుబ్బారావు గుప్తా, పువ్వాడ సుబ్బయ్య, షేక్‌ శ్రీనివాసరావు తదితరులు దామచర్లను కలిసిన వారిలో ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:32 AM