Share News

Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:40 AM

Nellore News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం..

Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!
Minister Kakani Govardhan

Nellore News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం వెలుగుచూసింది. సర్వేపల్లి నియోజకవర్గంలో తన గెలుపుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు కాకాణి.

ఇందులో భాగంగానే.. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎన్నికల విధుల్లో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోలుగా ఏళ్ల తరబడి అక్కడే విధులు నిర్వర్తించే వారికే బాధ్యతలు అప్పగించారు. వీరందరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. మంత్రి కాకాణి వద్ద పని చేస్తున్న ఓఎఎస్డీ, పీఎస్‌లు ఇప్పటికీ రిలీవ్ అవలేదు. అధికారులు వైసీపీ నేతల్లాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. అధికారుల పర్యవేక్షణలోనే ప్రతి వాలంటీర్‌కు రూ. 5 వేల చొప్పున పంపిణీ జరిగిందనే చర్చలు జరుగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 09:40 AM