Share News

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:52 AM

వచ్చే ఎన్నికల్లో పీవో, ఏపీవోలు నిష్పక్షిపాతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీనివాసులు సూచించారు.

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 15: వచ్చే ఎన్నికల్లో పీవో, ఏపీవోలు నిష్పక్షిపాతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీనివాసులు సూచించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం కళాశాలలో సోమవారం పివో, ఏపీవోలకు ఎన్నికల విధుల నిర్వహణపై శిక్షణ తరగతులను ఆళ్లగడ్డ అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్వహణలో అనుమానాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్వో నజీర్‌ అహమ్మద్‌, నియోజకవర్గంలోని మం డలాల తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:52 AM