Share News

నేడు డోన్‌, నందికొట్కూరుకు చంద్రబాబు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:16 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం డోన్‌, నందికొట్కూరులో పర్యటించనున్నారు.

నేడు డోన్‌, నందికొట్కూరుకు చంద్రబాబు

డోన్‌, నందికొట్కూరు, ఏప్రిల్‌, 28: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం డోన్‌, నందికొట్కూరులో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పట్టణంలోని వెంకటనాయునిపల్లె రహదారిలో ఏర్పాటు చేసిన మైదానంలో హెలికాప్టర్‌లో ల్యాండ్‌ అవుతారు. అక్కడి నుంచి వాహనంలో వచ్చి గాంధీ సర్కిల్‌లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.10 గంటలకు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పటేల్‌ సెంటర్‌కు రోడ్డు షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. 7.50 గంటలకు మాండ్ర శివానందరెడ్డి నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు.

Updated Date - Apr 29 , 2024 | 12:16 AM