Share News

బాలకృష్ణకు నీరాజనం

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:05 AM

నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాకర యాత్రకు జనం నీరాజనం పలికారు.

బాలకృష్ణకు నీరాజనం
కర్నూలులో మాట్లాడుతున్న బాలకృష్ణ

మేళాలు, తప్పెట్లు, కేరింతలతో సందడి

చిన్న అమ్మవారి శాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు యాత్ర

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 15: నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాకర యాత్రకు జనం నీరాజనం పలికారు. సోమవారం రాత్రి 8 గంటలకు నగరంలోని చిన్న అమ్మవారిశాల వద్ద కర్నూలు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌ తరపున నగరంలో సాధికార యాత్ర చేశారు. చిన్న ఆమ్మవారి శాల నుంచి గడియారం ఆస్పత్రి, పెద్దమా ర్కెట్‌ మీదుగా పాతబస్టాండ్‌, కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. యాత్రలో మహిళలు, మైనార్టీలు కిక్కిరిపోయారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: బాలకృష్ణ

ఓర్వకల్లు: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు గ్రామ సమీపంలోని ఓ రెస్టారెంటులో విశ్రాంతి తీసుకున్నారు. రెస్టారెంటు వద్ద ఆయనకు నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ మల్లికార్జున రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మే 13న జరిగే ఎన్ని కలపై రాజశేఖర్‌తో ఆయన చర్చించారు. అనంతరం బాలకృష్ణ మధ్యా హ్నం 3 గంటలకు నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగే సభలకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో నాయకులు మహబూబ్‌ బాషా, కేవీ మధు, బజారు, జయకృష్ణ, నాగరాజు, వేణు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:05 AM