గుడివాడలో వైసీపీకి షాక్లపై షాక్లు
ABN , Publish Date - Apr 16 , 2024 | 01:03 AM
గుడివాడ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగు లుతున్నాయి. పట్టణంలోని 34వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు ముడిలి రాంబాబు, మాతంగి కృష్ణలతో పాటు మరిన్ని కుటుంబాలు సోమవారం టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు రాంబాబు, కృష్ణ
గుడివాడ: గుడివాడ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగు లుతున్నాయి. పట్టణంలోని 34వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు ముడిలి రాంబాబు, మాతంగి కృష్ణలతో పాటు మరిన్ని కుటుంబాలు సోమవారం టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండు వాను కప్పి రాము పార్టీలోకి ఆహ్వానించారు. తొలుత 34వ వార్డులో బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయదుర్గ అమ్మవారి దేవ స్థానం లో ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ నాయకులు దింట్యాల రాంబాబు, లింగం ప్రసాద్, బోరాడ మధుసూదనరావు, గంటా అజయ్, శివకృష్ణ, బొడ్డు లక్ష్మి, కళా వతి, మధుబాబు, సునీల్, రంభ, చక్రపాణి, అమ్ముల సురేంద్ర, జితేంద్ర తదిత రులు పాల్గొన్నారు.