Share News

కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:01 AM

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలని బోడె సతీమణి హేమ, మునిసిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావులు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి పోరంకి ఆరవ డివిజన్‌, యనమలకుదురులో జరిగిన శంఖారావం పాదయాత్ర కార్యక్రమాల్లో వారు పాల్గొని స్థానికులతో మాట్లాడారు.

 కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం
యనమలకుదురులో జరిగిన శంఖారావంలో బోడె హేమ

పెనమలూరు, ఏప్రిల్‌ 15 : వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలని బోడె సతీమణి హేమ, మునిసిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావులు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి పోరంకి ఆరవ డివిజన్‌, యనమలకుదురులో జరిగిన శంఖారావం పాదయాత్ర కార్యక్రమాల్లో వారు పాల్గొని స్థానికులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును, పెనమలూరు ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అనంతనేని ఆజాద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, శొంఠి శివరాంప్రసాద్‌, వీరంకి కుటుంబరావు, మల్లంపాటి విజయలక్ష్మి, తమ్ము అశోక్‌, బెజవాడ వెంకటేష్‌, కందుల శివరాం, కరిమికొండ ప్రసాద్‌, బాబు, మల్ల వెంకటేశ్వరరావు, వీరంకి నంది, కళ్యాణం శ్రీనివాస్‌, ఇబ్రహీం పాల్గొన్నారు.

ఉయ్యూరు 20వ వార్డులో..

ఉయ్యూరు : చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుం దని టీడీపీ నాయకుడు పండ్రాజు చిరంజీవి అన్నారు. ఉయ్యూ రు నగర పంచాయతీ 20వ వార్డులో సోమవారం పర్యటించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలియజేసి సైకిల్‌, గాజుగ్లా సు గుర్తులకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చందు, కొండపల్లి పవన్‌, కె శ్రీనివాసరావు, నాగరాజు పాల్గొన్నారు.

వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు..

కంకిపాడు : వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబు తారని టీడీపీ మండల పార్టీ నాయకులు, బూత్‌ కమిటీ చైర్మన్‌ పులి శ్రీనివాసరావు అన్నారు. కంకిపాడులోని 175 బూత్‌లో సోమవారం నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెం టీ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొండా నాగేశ్వరరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోగినేని వెంకట రమణ, ఏనుగ జయప్రకాష్‌ షేక్‌ బాజి పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి టీడీపీతోనే

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటే టీడీపీతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు బేతా శేషుకుమార్‌ తెలిపారు. ఆరుగొలను టీడీపీ, జనసేన కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల బ్రహ్మాజీ, అనిల్‌కుమార్‌, వీరం రాం బాబు, జనసేన నాయకులు లబ్బా శంకరం, వీరం వినయ్‌కుమార్‌, చొక్కాపు సత్యనారాయణ,చిన్నం మాణిక్యం, రావులపాటి భానుకుమార్‌, నాగు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:01 AM