రాష్ట్రాభివృద్ధే అజెండా
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:59 PM
రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే కూటమి అజెండా అని టీడీపీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు అన్నారు. కొవ్వూరులోని 1, 20, 22వ వార్డుల్లో ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంటమణి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు.
టీడీపీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు
కొవ్వూరు, ఏప్రిల్ 28: రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే కూటమి అజెండా అని టీడీపీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు అన్నారు. కొవ్వూరులోని 1, 20, 22వ వార్డుల్లో ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంటమణి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో, మహాశక్తి, సూపర్సిక్స్ పథకాలను వివరించారు. అచ్చిబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో విధ్వంసం, విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రతి గ్రామంలోను పార్టీ నాయకులంతా సమిష్టిగా కూటమి అభ్యర్ధుల విజయానికి కృషిచేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుకు సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటువేసి గెలిపించాలన్నారు. అలాగే స్థానిక టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ కార్యాలయంలో సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు మేము సైతం మన రాష్ట్రం కోసం తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ బ్యానర్ను రిలీజ్ చేశారు. కార్యక్రమాల్లో మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, దాయన రామకృష్ణ, సూర్యదేవర రంజిత్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, రాజాన శ్రీనివాస్, మడిచర్ల రామచంద్రరావు, కేవీకే రంగారావు, బర్ల శ్రీనివాస్, కౌన్సిలర్ కిలారి వెంకటలక్ష్మి, కిలారి రమణ, వరిగేటి కాంతరాజు, మద్దిపట్ల సురేష్, బూరుగుపల్లి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.