ఎన్నికల్లో గెలిపించి ఆశీర్వదించండి : సత్యప్రభ
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:32 AM
ప్రత్తిపాడు, ఏప్రిల్ 15: దివంగత టీడీపీ నేత వరుపుల రాజా ఆశయ సాధన నియోజకవర్గ అభివృద్ధికి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి ఆశీర్వదించాలని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. ఒమ్మంగి రామిశెట్టి గోవిందరాజులు కల్యా
ప్రత్తిపాడు, ఏప్రిల్ 15: దివంగత టీడీపీ నేత వరుపుల రాజా ఆశయ సాధన నియోజకవర్గ అభివృద్ధికి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి ఆశీర్వదించాలని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. ఒమ్మంగి రామిశెట్టి గోవిందరాజులు కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో సత్యప్రభ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నామినేషన్ ఈ నెల 23న దాఖలు చేస్తానని, 23న పెదశంకర్లపూడి పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9.30గంటలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు అమరాది వెంకట్రావు, సూది బూరయ్య, బద్ది రామారావు, తమరాల సత్యనారాయణ, కొమ్ముల కన్నబాబు, ఎంపీపీ లు గొల్లపల్లి నరసింహమూర్తి, గంటుమళ్ళ రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఇతంశెట్టి భాస్కరబాబు, మాజీ జడ్పీటీసీ బచ్చల గంగ, మాజీ సర్పంచ్ పైలా సాంబశివరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు చిక్కాల లక్ష్మణరావు, వెన్నా ఈశ్వరుడు, బద్ది రమణ పాల్గొన్నారు.