Share News

నగర పంచాయతీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతా

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:43 AM

ముమ్మిడివరం నగర పంచాయతీని అభివృద్ధిలో అగ్రస్థానలో నిలుపుతానని ముమ్మిడివరం అసెంబ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.

నగర పంచాయతీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతా

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 14: ముమ్మిడివరం నగర పంచాయతీని అభివృద్ధిలో అగ్రస్థానలో నిలుపుతానని ముమ్మిడివరం అసెంబ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీలోని 8, 9, 12, 14, 15 వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమై ఓట్లు అభ్యర్థించారు. తొలుత అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని పోలమ్మ చెరువుగట్టున ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రచారం నిర్వహించారు. మే13న జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. నగరపంచాయతీలోని పలు వార్డుల్లో మహిళలు హారతులతో స్వాగతం పలికారు. 12వవార్డులో కౌన్సిలర్‌, దివంగత భీమవరపు విజయ్‌ మాతృమూర్తి పుష్పరత్న అనసూయ కుటుంబ సభ్యులు అనుచరులతో వైసీపీ నుంచి టీడీపీలో చేరగా వారికి కండువాకప్పి ఆహ్వానించారు. 14వవార్డులో వైసీపీకి చెందిన గళ్లా సత్యనారాయణ టీడీపీలో చేరగా బుచ్చిబాబు కండువాకప్పి ఆహ్వానించారు. గుత్తుల సాయి, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, తాడి నరసింహారావు, వేగిరౌతు రాజబాబు, దొమ్మేటి రమణకుమార్‌, అర్థాని శ్రీనివాసరావు, కట్టా సత్తిబాబు, ములపర్తి బాలకృష్ణ, అడబాల సతీష్‌, దాట్ల బాబు, కడలి నాగు, దివి మహలక్ష్మి, మాదాల బుజ్జి, దూడల స్వామి, బొక్కా రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడుపూడి మల్లేశ్వరి, పెదపూడి రుక్మిణి, గిడ్డి రత్నశ్రీ, చిక్కాల అంజిబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 12:43 AM