Share News

కొత్త డ్రామాకు తెరతీసిన జగన్‌ : జ్యోతుల నెహ్రూ

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:31 AM

జగ్గంపేట, ఏప్రిల్‌ 15: సీఎం జగన్‌ కొత్త డ్రామాకు తెరతీశారని జగ్గంపేట ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విమర్శించారు. సోమవారం గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో నామినేషన్‌ ముందు తం

కొత్త డ్రామాకు తెరతీసిన జగన్‌ : జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, ఏప్రిల్‌ 15: సీఎం జగన్‌ కొత్త డ్రామాకు తెరతీశారని జగ్గంపేట ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విమర్శించారు. సోమవారం గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో నామినేషన్‌ ముందు తంటికొండ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనవాయితీగా వస్తుందని, గోకవరం మండలంలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారన్నారు. సీఎం జగన్‌పై దాడి నిజంగా జరి గితే తీవ్రంగా ఖండిస్తున్నానని కానీ ఈలోగా తగిన గాయం చూస్తుంటే వై ఆకారంలో ఉందన్నారు. సోషల్‌ మీడియాలో వీడియో చూస్తుంటే దండ వేసేటప్పుడు తగిలిన గాయంగా కనిపిస్తుందన్నారు. గత 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామాతో, నారా వారి రక్త చరిత్ర అని మాయమాటలతో గద్దెనెక్కిన జగన్‌ మళ్లీ ఇప్పుడు కోడికత్తి సెకండ్‌పార్ట్‌ విడుదల చేసినట్టు ఉందన్నారు. ఈ గాయాలతో ప్రజలను మధ్యపెట్టాలని ప్రతిపక్షాలపై నెట్టాలని ఈ విధంగా చేయడం విడ్డూరంగా ఉందని, జగన్‌ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:31 AM