Share News

ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన్‌

ABN , Publish Date - Apr 15 , 2024 | 02:19 AM

ఈవీఎంల తనిఖీలు ఆదివారంతో ముగిశాయి. కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాములో కలెక్టర్‌ షన్మోహన్‌ నేతృత్వంలో మూడ్రోజుల పాటు ఈ ర్యాండమైజేషన్‌ కొనసాగింది.

ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన్‌

ఫ నియోజకవర్గాలవారీగా కేటాయింపు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 14: ఈవీఎంల తనిఖీలు ఆదివారంతో ముగిశాయి. కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాములో కలెక్టర్‌ షన్మోహన్‌ నేతృత్వంలో మూడ్రోజుల పాటు ఈ ర్యాండమైజేషన్‌ కొనసాగింది. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2120 చొప్పున బ్యాలెట్‌.. కంట్రోల్‌ యూనిట్లు, 2297 వీవీప్యాట్ల తనిఖీలు జరిగాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇదే సంఖ్యలో తనిఖీలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల లాగిన్‌ ద్వారా నెంబర్‌ స్కానింగ్‌ పూర్తిచేశారు. ఆయా నియోజకవర్గ ఆర్వోలకు వీటిని అందించారు. పోలింగ్‌ ప్రారంభమయ్యేంతవరకు వీటిని ఇక్కడి గోదాముల్లోనే నిల్వ ఉంచుతారు.

Updated Date - Apr 15 , 2024 | 02:19 AM