దేవదాయశాఖ ఏసీకి నోటీసు
ABN , Publish Date - Apr 15 , 2024 | 02:17 AM
జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనరు ప్రసన్నలక్ష్మికి జాయింట్ కలెక్టరు శ్రీనివాసులు ఆదివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు.
చిత్తూరు కల్చరల్, ఏప్రిల్ 14: జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనరు ప్రసన్నలక్ష్మికి జాయింట్ కలెక్టరు శ్రీనివాసులు ఆదివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. కోడ్ను అతిక్రమించి కట్టమంచి వరదరాజస్వామి ఆలయంలో ఈ నెల 12వ తేది అధికార పార్టీ ఎన్నికల సమావేశం నిర్వహించినందుకుగాను ఈ నోటీసు ఇచ్చారు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రతినిధులు, అనుమతించిన అధికారుల వివరాలతో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై ఏసీని సంప్రదించగా, కర్నూలు ఎన్నికల శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఉన్నానని, సోమవారం తెలియజేస్తానని చెప్పారు.