ఎన్నికల వివరాలతో సిద్ధంగా ఉండండి
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:51 AM
జిల్లాకు నియమితులైన ఎన్నికల పరిశీలకులు త్వరలో రానున్నారని, వారికి అవసరమైన ఎన్నికల సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని లైజన్ ఆఫీసర్లను జేసీ శ్రీనివాసులు ఆదేశించారు.
లైజన్ ఆఫీసర్లకు జేసీ సూచన
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 15: జిల్లాకు నియమితులైన ఎన్నికల పరిశీలకులు త్వరలో రానున్నారని, వారికి అవసరమైన ఎన్నికల సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని లైజన్ ఆఫీసర్లను జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం సాయంత్రం జేసీ సమావేశ హాలులో ఎన్నికల పరిశీలకుల నోడల్ ఆఫీసర్, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డితో కలిసి జేసీ సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో వారికి సంబంధించి ఎప్పటికప్పుడు వ్యయ వివరాలతో కూడిన నివేదికలను అందజేస్తుండాలన్నారు. ముందస్తుగా ఎన్నికల పరిశీలకులతో వారి రోజువారి పర్యటన వివరాలను తెలుసుకుని ఆ ప్రాంతాలకు వారితో వెళ్ళాలని ఆయన సూచించారు.