మీ ఇంటి బిడ్డను గెలిపించండి
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:34 AM
: సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డనైన తనను భారీ మెజార్టీతో గెలపించాలని కూటమి శింగనమల నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
నార్పల, ఏప్రిల్ 29 : సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డనైన తనను భారీ మెజార్టీతో గెలపించాలని కూటమి శింగనమల నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సోమవారం నార్పలలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బం డారు శ్రావణి, ఆలం నరసానాయుడు నార్పల లోకి రాగానే టీడీపీ యువ నాయకులు ఆలం వెంకట నరసా నాయుడు, ఆకుల బాబు కలసి భారీ ఎత్తున మహిళలు, తెలుగు తమ్ములతో కలిసి వారికి హారతినిస్తూ, టపాసులు పేల్చి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు, పిట్టు రంగారెడ్డి, ఆకుల ప్రసాద్, ఎర్రనాగప్ప, పీఎల్ లక్ష్మీనారాయణ, ఆకుల అనిల్ పాల్గొన్నారు.
ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయాలి
బుక్కరాయసముద్రం : ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బండారు శ్రావణిశ్రీ డిమాండ్ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో పింఛన్లు జమ చేస్తే వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతారన్నారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ దెబ్బకి తాళలేక అనేక మంది మరణించారని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అదే తప్పు చేస్తోందని అన్నారు. వైసీపీ కుట్ర వల్లే పెన్సన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని అన్నారు.
నేడు పుట్లూరు మండలంలో ప్రచారం
శింగనమల : శింగనమల టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ మంగళవారం పుట్లూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండ లంలోని గురుగు చింతలపల్లి కోమటికుంట్ల, ఎస్ గూడూరు, నాగిరెడ్డిపల్లి పూట్లూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
మరిన్ని వార్తల కోసం...