సమన్వయంతో కూటమి అభ్యర్థులను గెలిపించండి
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:33 AM
టీడీపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, అంబికా లక్ష్మినారాయణను గెలిపించాలని టీడీపీ అర్బన నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు లక్ష్మినారాయణ సూచించారు.
అనంతపురం ప్రెస్క్లబ్, ఏప్రిల్ 28 : టీడీపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, అంబికా లక్ష్మినారాయణను గెలిపించాలని టీడీపీ అర్బన నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు లక్ష్మినారాయణ సూచించారు. ఆదివారం జిల్లాకొచ్చిన ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. టీడీపీ, జనసేన మధ్య సమన్వయం లోపం లేకుండా తాను చూసుకుంటానన్నారు.
ఈ నేపథ్యంలో విశ్రాంత ఏఎస్పీ రజాక్ జనసేనలో చేరారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, సీనియర్ నాయకులు కాయగూరల లక్ష్మిప్రసాద్, అడ్వకేట్ ఎంసీ బాలన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు అవుకు విజయ్కుమార్, ముప్పూరి కృష్ణ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...