Share News

అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:18 AM

గ్రామస్థాయి నుంచి రాష్ట్రం అభివృ ద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని, ఆ దిశగా అందరూ ఆశీర్వదిం చాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ కోరారు.

అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి
తమ్మడేపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న సునీల్‌కుమార్‌

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌

మడకశిరటౌన, ఏప్రిల్‌ 15: గ్రామస్థాయి నుంచి రాష్ట్రం అభివృ ద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని, ఆ దిశగా అందరూ ఆశీర్వదిం చాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ కోరారు. ఆయన సోమవారం అమరాపురం మండల పరిధిలోని గౌడనకుంట, దేవగానపల్లి, తమ్మడేపల్లి, వీ అగ్రహారం, వలస, విరుపసముద్రం తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని, టీడీపీ అధికారం లోకి వస్తే ప్రవేశపెట్టే బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారంటీ, సూపర్‌సిక్స్‌ వంటి కార్యక్రమాలను వివరించారు. పేదల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పనలో పూర్తి గా విఫలమయ్యారన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, అర్హులకు సంక్షేమ ఫలా లు సక్రమంగా అందించలేదన్నారు. గత టీడీపీ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, కృష్ణా జలాలను మడకశిర నేలకు తాకించిన ఘనత చంద్రబా బుదే అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రతి చెరువుకు నీరు నింపి నియోజకవ ర్గాన్ని సస్యశ్యామలం చేసేవారన్నారు. తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని, ఆగిపోయిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఉగ్రనరసింహప్ప, కృష్ణమూర్తి తదితరులతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:18 AM