సూపర్ సిక్స్ పథకాలపై ముమ్మర ప్రచారం
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:35 AM
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 15: మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో టీడీపీ నాయకులు సూర్యశేఖర్రెడ్డి, భాస్కర్రెడ్డి, మిట్టపల్లి పంచాయతీలో జిల్లా మైనార్టీ కార్యదర్శి మండోజీ ఆర్పీఖాన, పొగాకు షబ్బీర్, టీఎనటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు నిజాం తదితరులు సూపర్సిక్స్ పథకాలపై ప్రచారం చేశారు.
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 15: మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో టీడీపీ నాయకులు సూర్యశేఖర్రెడ్డి, భాస్కర్రెడ్డి, మిట్టపల్లి పంచాయతీలో జిల్లా మైనార్టీ కార్యదర్శి మండోజీ ఆర్పీఖాన, పొగాకు షబ్బీర్, టీఎనటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు నిజాం తదితరులు సూపర్సిక్స్ పథకాలపై ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఇంటింటా తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు సీఎం కాగానే వాటిని అమలు చేస్తారని తెలిపారు. కూటమి గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయలని కోరారు. కార్యక్రమాల్లో తెలుగుయువత నాయకులు బూదిలి ఓబులరెడ్డి, బోనాల రామాంజి, బైరిశెట్టి, వీరయ్య, రామాంజి, తుమ్మలప్రసాద్, గంగాధర్, బోనాల లక్ష్మీనారాయణ, సురేంద్ర, శివానంద, చంద్ర, హనుమంతురెడ్డి, నంది నరసింహులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తనకల్లు: మండలంలోని ముండ్లవారిపల్లిలో ఆదివారం రాత్రి సూపర్ సిక్స్పథకాలపై టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మండల కన్వీనర్ రెడ్డిశేఖర్రెడ్డి, సీనియర్ నాయకులు బాగేపల్లి చలపతి , వెంకటరెడ్డి, బాగేపల్లి అశోక్ పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్: మండలంలోని గరుడంపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు సూపర్సిక్స్ పథకాలపై ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సీఎం అవగానే ఈ పథకాలను అమలు చేస్తారని తెలిపారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మేకలరామాంజనేయులు, సర్పంచ ముత్యాలప్పనాయుడు, నాయకులు మహేష్చౌదరి, విజయసారథి, పాళ్యంవెంకటేష్, నారాఅశోక్, మల్లి, గరుడంపల్లి చంద్రశేఖర్ బీజేపీ మండల ఇనఛార్జ్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.