ప్రమాణం చేసి చెబుతున్నా.. అభివృద్ధికి కృషి చేస్తా
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:32 AM
ధర్మవరంరూరల్, ఏప్రిల్15: ప్రమాణం చేసి చెబుతున్నా ధర్మవరం అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని హిందూపురం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకేపార్థసారథి హామీ ఇచ్చారు.
ధర్మవరంరూరల్, ఏప్రిల్15: ప్రమాణం చేసి చెబుతున్నా ధర్మవరం అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని హిందూపురం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకేపార్థసారథి హామీ ఇచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన ధర్మవరం పట్టణ, రూరల్ మండల నాయకు లు, కార్యకర్తలతో సమావే శం నిర్వహించి మాట్లాడారు. గతంలో తాను ఎం పీగా, జడ్పీచైర్మనగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి అనేక నిధులు ఇచ్చాననని గుర్తు చేశారు. తాగునీటి కోసం, బస్టాండ్లు ఏర్పాటుకు, గ్రామాల అభివృద్ధికి తనవంతుగా ప్రతి మండలానికి నిధులు ఇచ్చానని తెలిపారు. ప్ర స్తుత ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే ఎమ్మెల్యేగా సత్యకుమార్ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, నాయకులు మహే్షచౌదరి, మాజీ ఎంపీపీ మద్దిలేటి, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజినేయులు, సర్పంచ ముత్యాలప్ప నాయుడు, గొట్లూరుశ్రీనివాసు లు, రాఘవరెడ్డి, తలారివెంకటలక్ష్మీ, రాంపురంశీనా, విజయ్చౌదరి, పాళ్యం వెంకటేష్, అశ్వర్థనాయుడు పాల్గొన్నారు.