నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి
ABN , Publish Date - Apr 15 , 2024 | 11:56 PM
ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. సోమవారం పట్టణంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు.
కలెక్టర్ వినోద్కుమార్
రాయదుర్గంరూరల్, ఏప్రిల్ 15: ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. సోమవారం పట్టణంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. పట్టణ శివారులోని గాలిమారమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్పోస్టును తనిఖీ చేశారు. అనంతరం బాలగంగాధర్ తిలక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం సా్ట్రంగ్రూమ్ను తనిఖీ చేశారు. ఓటుహక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహనలో భాగంగా వినాయకసర్కిల్ నుంచి పాతబస్టాండ్, లక్ష్మీబజార్, ఆర్అండ్బీ అతిథిగృహం వరకు కేంద్ర బలగాలతో మార్చ్పాస్ట్ నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. జడ్పీ సీఈఓ వైఖోంనిదియాదేవి, ఆర్ఓ కరుణకుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసులు, తహసీల్దార్ చిట్టిబాబు పాల్గొన్నారు.