Share News

కూటమి అధికారంలోకి రావడం ఖాయం: పల్లె

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:30 AM

బుక్కపట్నం: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కూటమి అధికారంలోకి రావడం ఖాయం: పల్లె

బుక్కపట్నం: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని పాముదుర్తి పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన 15కుటుంబాల వారు సోమవారం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాకేంద్రంలోని పల్లె నివాసంలో వారు పార్టీలోకి చేరారు. పల్లె వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈసారి కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి రావడం ఖామన్నారు. నియోజకవర్గంలో పల్లె సింధూరను గెలిపించాలని కోరారు. టీడీపీలోకి చేరిన వారిలో నారాయణస్వామి, మల్లికార్జున, కళ్యాణ్‌, తిరుపాల్‌, రామక్రిష్ణ, రామాంజి, గంగాద్రి,చిన్న మునెప్ప తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు ముద్దపాటి రవి, వంశీ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:30 AM