Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

ABN , Publish Date - May 05 , 2024 | 12:14 AM

షాద్‌నగర్‌ ప్రాం తంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వికాస్‌రెడ్డి(ఫైల్‌)

షాద్‌నగర్‌ రూరల్‌, మే 4 : షాద్‌నగర్‌ ప్రాం తంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. శనివారం షాద్‌నగర్‌ శివారులో బైక్‌ నుంచి పడి యువకుడు మృతిచెందాడు. ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌కు చెందిన వికాస్‌రెడ్డి (36) సాయంత్రం బైక్‌పై షాద్‌నగర్‌ నుంచి సొంతూరు వెళ్తుండగా బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో పడిపోయిన వికాస్‌రెడ్డి తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ సీహెచ్‌సీకి తరలించారు. కాగా వికాశ్‌రెడ్డి ప్రమా దంపై ఎమ్మెల్యే శంకర్‌, మాజీ ఎమ్మె ల్యే ప్రతా్‌పరెడ్డిలు తెలుసుకొని ఆస్ప త్రికి చేరుకున్నారు. మృతుడి కుటుం బసభ్యులను వారు పరామర్శించారు.

లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు ...

కొత్తూర్‌, మే 4 : మండల పరిధి తిమ్మాపూర్‌ సమీప 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్మూరి సురేష్‌(25) అనే వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై కె.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జి ల్లా శ్రీపురానికి చెందిన సురేష్‌ కుటుంబంతో కలిసి కొ త్తూర్‌ వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. బైక్‌పై తిమ్మాపూర్‌నకు వెల్లొస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొని సురేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. మృతదేహాన్ని సీహెహెచ్‌సీకి త రలించి, సురేష్‌ తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సురే్‌షకు భార్య, కొడుకు ఉన్నాడు.

Updated Date - May 05 , 2024 | 12:14 AM