Share News

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , Publish Date - May 05 , 2024 | 12:08 AM

మండల పరిధి కుమ్మెర గ్రామంలోని పొలాల వద్ద ఉన్న చెట్టు కింద గుర్తు తెలియని మృతదేహం లభ్య మైంది.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

చేవెళ్ల, మే 4 : మండల పరిధి కుమ్మెర గ్రామంలోని పొలాల వద్ద ఉన్న చెట్టు కింద గుర్తు తెలియని మృతదేహం లభ్య మైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మెరలో పొలాల వద్ద చెట్టు కింద ఓ పురుషుడి మృతదేహాన్ని గుర్తిం చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి పోసులు వె ళ్లి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతుడు ఉత్తరాది వాడిగా, మతిస్థిమితం లేక తిరిగి ఎండలకు తాళలేక చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశామని ఎస్పై ప్రదీప్‌కుమార్‌ చెప్పారు.

పాల్మాకుల వద్ద రోడ్డు పక్కన శవం లభ్యం

శంషాబాద్‌ రూరల్‌ : గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైన సంఘటన శనివారం శంషాబాద్‌ మండలం పాల్మాకుల వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి పక్కన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(40) మృతదేహం పడి ఉందని సమాచారం రాగా పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతుడు బిక్షాటన చేసే వ్యక్తి గా అనుమానిస్తున్నారు. ఒంటిపై గాయలు లేవు. వడదెబ్బ తగిలి మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:08 AM