Share News

భూ తగాదాలో ఇరువర్గాల ఘర్షణ

ABN , Publish Date - May 05 , 2024 | 12:09 AM

భూ తగాదాలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన శనివారం మాల్‌లో జరిగింది.

భూ తగాదాలో ఇరువర్గాల ఘర్షణ

యాచారం, మే 4 : భూ తగాదాలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన శనివారం మాల్‌లో జరిగింది. ఎస్సై వెంకటనారాయణ తెలిపిన వివరాల మేరకు.. మాల్‌లోని సర్వే నంబర్‌460లో గల 18ఎకరాల 27గుంటల భూమిపై కొన్నేళ్లుగా పురుషోత్తంరెడ్డి, గోపాల్‌, శ్రీనుల మధ్య వివాదం నడుస్తోంది. తర చూ ఘర్షణ పడుతున్నారు. పోలీసుల ముందే గోపాల్‌, శ్రీనుల వర్గీయులు పురుషోత్తమ్‌రెడ్డి వర్గీయులపై దాడికి దిగారు. ఇరువర్గాలను పోలీసులు సముదాయించినా వినలేదు. దీంతో ఎస్సై కేసు నమోదు చేశారు.

Updated Date - May 05 , 2024 | 12:10 AM