అన్న దాడితో మనస్తాపం.. తమ్ముడి ఆత్మహత్య
ABN , Publish Date - May 05 , 2024 | 12:12 AM
అన్నదమ్ముల గొడవలో తమ్ముడిపై అన్న, అతడి కొడుకులు దాడితో మనస్తాపానికి గురైన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం కలకొండలో చోటుచేసుకుంది.
మాడ్గుల, మే 4 : అన్నదమ్ముల గొడవలో తమ్ముడిపై అన్న, అతడి కొడుకులు దాడితో మనస్తాపానికి గురైన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం కలకొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్న పులి పాపయ్య, తమ్ముడగు పులి యాదయ్య(40) పొలం వద్ద గొడవపడ్డారు. పాపయ్య, అతడి కొడుకులు శ్రీనాథ్, శివ కలసి యాదయ్యను కొట్టారు. దీంతో మనస్థాపానికి గురైన యాదయ్య పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్లాటకు పాత పగలే కారణమని యాదయ్య భార్య పులి పుష్ప, సీఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. తన భర్తను కొట్టడంవల్లే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని పుష్ప ఫిర్యాదు చేశారు. మగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. యాదయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
అనారోగ్యాన్ని భరించలేక వ్యక్తి...
శంషాబాద్: శంషాబాద్ పట్టణ రాళ్లగూడ బస్తీకి చెందిన శ్రీనివాస్రెడ్డి(37) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధడేవాడు. రెండు రోజుల క్రితం ఇంటినుంచి ఎటో వెళ్లిపోయాడు. కుటుంబీకులు అతడి కోసం వెతుకగా శనివారం గ్రామ శివారులోని పోర్టు గ్రాండ్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.