Share News

భూతగాదాలో వ్యక్తి దారుణ హత్య

ABN , Publish Date - May 05 , 2024 | 12:08 AM

భూతగాదాలో జరిగిన దాడిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మోమిన్‌పేట్‌ మండలంలో చోటుచేసుకుంది.

భూతగాదాలో వ్యక్తి దారుణ హత్య

మోమిన్‌పేట్‌, మే 4: భూతగాదాలో జరిగిన దాడిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మోమిన్‌పేట్‌ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అరవింద్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని హైమత్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ సిరాజ్‌ తన బంధువైన టేకులపల్లి గ్రామానికి చెందిన సయ్యద్‌ అజ్జర్‌అలీ అలియాస్‌ చోటేమియా ఇద్దరి మధ్య భూవివాదం 20సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఇదేవిషయంపై శుక్రవారం రాత్రి సిరాజ్‌ టేకులపల్లికి వచ్చి భూమిలో తమకు భాగం వస్తుందని అడుగుతూ పొలం వద్ద కాడెద్దుల కొట్టం దగ్గరికి వెళ్లాడు. ఈక్రమంలో 15ఎకరాల భూమి విషయంలో సయ్యద్‌ అజ్జర్‌అలీతో గొడవపడ్డాడు. తాను 20సంవత్సరాల కిందట డబ్బులు పెట్టి భూమిని కొనుగోలు చేశానని చెప్పడంతో అజ్జర్‌అలీ అలియాస్‌ చోటే మియా కోపంతో సయ్యద్‌సిరాజ్‌ అహ్మద్‌ను తలపై బలంగా కొట్టాడు. దీంతో సిరాజ్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి నిందితుడు అజ్జర్‌ అలీని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.

Updated Date - May 05 , 2024 | 12:08 AM