‘పట్టభద్రుల’ స్థానానికి మూడో రోజు నాలుగు నామినేషన్లు
ABN , Publish Date - May 04 , 2024 | 11:35 PM
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక స్థానానికి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.
నల్లగొండ టౌన్, మే 4: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక స్థానానికి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మూడో రోజు శనివారం నల్లగొండ కలెక్టరేట్లో నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్నె రవి ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థులుగా బక్క జడ్సన్ రెండు సెట్లు, భైరవ భట్ల శ్రీనివాసరావు, దైద సోమ సుందరం ఒక్కో సెట్ నామినేషన్ దాఖలుచేశారు. ఇందులో కర్నె రవి నవక్రాంతి పార్టీ తరఫున, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు అదనపు కలెక్టర్, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్.మహేందర్జీకి అందజేశారు.
నామినేషన్ కౌంటర్
పట్టభద్ర 4న గతంలో మొత్తం
నియోజకవర్గం దాఖలు దాఖలు
నల్లగొండ 4 8 12