Home » Telangana » Nalgonda
సంతానం కలగడం లేదని ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపాడులో ఈ సంఘటన జరిగింది.
ఆలిండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన పోటీల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శశాంక్ వనమాల ఛాంపియనగా నిలిచారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలను గణనీయంగా తగ్గించాలని, లేదంటే ఆస్పత్రులను సీజ్ చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్వోలు యశోద, శిల్పిణి హెచ్చరించారు. చౌటుప్పల్ పట్టణంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులను శుక్రవారం వారు ఆకస్మిక తనిఖీ చేశారు.
భానుడి భగభగలు, ఉక్కపోతలు ఉమ్మడి జిల్లావాసులను ఆర్థికంగా, శారీరంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సూర్య ప్రతాపానికి జన జీవనంతోపాటు, వ్యాపార రంగాలు అతలాకుతలమవుతున్నాయి.
గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్ర, చేనేత చేయూత సంక్షేమ పథకాలు కొనసాగించాలని, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన చేనేత భరోసా విధి విధానాలు ప్రకటించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ఆలయానికి(గుహ) కొత్త గా మూడో దర్వాజను ఏర్పాటు చేయనున్నా రు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజారంజక పాలనకు తోడు కార్యకర్తల కృషి ఫలితంగా పార్లమెంట్ ఎన్నికలలో తొలిసారిగా భువనగిరి ఖిల్లాపై కాషాయ జెండా ఎగరడం ఖాయమైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో భాగంగా మిగిలిపోయిన ధాన్యం సేకరణ వెంటనే పూర్తి చేసి అట్టి ధాన్యాన్ని త్వరితగతి న దిగుమతి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించా రు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని, గ్రామీణ నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఆసుపత్రి ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్వోసీ చెక్కులు మంజూరు చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల పనులు ఇకపై వేగవంతం కానున్నాయి. ఈ నెలాఖరు వరకు శ్రీశైలం సొరంగమార్గం తవ్వకాల పనులు తిరిగి ప్రారంభంకానున్నాయి. అందుకు ప్రభుత్వ ఆదేశాలమేరకు నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టులను పరిశీలించారు.