కేంద్రంలో బీజేపీదే అధికారం
ABN , Publish Date - May 04 , 2024 | 12:40 AM
దేశమం తా మోదీ మేనియా కొనసాగుతోందని కేంద్రంలో 3వ సారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం బీబీనగర్, భూదాన్పోచంపల్లి, వలిగొండలో రోడ్షో నిర్వహించారు.
పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
బీబీనగర్, అడ్డగూడూరు,భూదాన్ పోచంపల్లి, వలిగొండ, మే 3: దేశమం తా మోదీ మేనియా కొనసాగుతోందని కేంద్రంలో 3వ సారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం బీబీనగర్, భూదాన్పోచంపల్లి, వలిగొండలో రోడ్షో నిర్వహించారు. అనంతరం పోచంపల్లి చౌరస్తాలో నిర్వహించిన కార్నర్మీటింగ్లో బూర నర్సయ్య గౌడ్ కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మం జూరైన అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఎయిమ్స్ ఆస్పత్రిని బీబీనగర్కు తీసుకురావడం లో తనపాత్ర ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. మరోసారి బీజేపీకి ఓటేసి ఎంపీగా గెలిపిస్తే ఎయిమ్స్లాంటి జాతీయ సంస్థలను నియోజకవర్గానికి తీసుకొస్తానన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలో జరిగిందే తప్పా కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిందేమీ లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, కర్నాటి ధనుంజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, మండల అధ్యక్షులు ఇంజమూరి ప్రభాకర్, పిట్టల అశోక్, గడ్డం జంగారెడ్డి, వెంకటేశ్, కసగోని వంశీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా అడ్డగూడూరు మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు.