కేసీఆర్ వెంటే రాష్ట్ర ప్రజలు
ABN , Publish Date - May 02 , 2024 | 11:31 PM
రాష్ట్ర ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.
- కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
అయిజ, మే 2 : రాష్ట్ర ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. అయిజ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని కోరారు. బీజేపీకి ఇక్కడ ఓటర్లు లేరని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారని, ఆ జనం ఇప్పటికీ మన వెంటే ఉన్నారని గుర్తు చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే ఉన్నారని, ఎంపీగా లోక్సభ అభ్యర్థి ప్రవీణ్కుమార్ను గెలిపించు కోవాలని కోరారు. దీంతో నడిగడ్డ మొత్తంగా బీఆర్ఎస్ పాలన సాగుతుందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ ప్రహ్లాదరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పుష్ప, మునిసిపల్ చైర్మన్ దేవన్న, వైస్ చైర్మన్ మాల నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.