Home » Telangana » Mahbubnagar
ఉమామహేశ్వర క్షేత్రంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ తన కుమారుని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి ఈ శ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతీ నెలలో ఒకరోజు ప్రజావాణి నిర్వహించాలని దివ్యాంగులు ఎస్పీ యోగేష్ గౌతమ్ను కోరారు.
పాఠశాలలు పునఃప్రారం భం కాక ముందే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు, ఇతర పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశ కార్యకర్తలు బీపీ స్ర్కీనింగ్ పరీక్షలు చేస్తున్నారని, 30 సంవత్సరాల వయసు దాటిన వారందరూ పరీక్షలు చేయించు కోవాలని డీఎంహెచ్వో డాక్టర్ శశికళ సూచించారు.
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షపాతం నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల రోజు నుంచి వాతావరణం చల్లబడగా.. ప్రతీ రోజూ ఏదో ఒకచోట వర్షాలు కురుస్తున్నాయి. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మీరు క్రెడిట్ కార్డుకు అర్హులయ్యారని, మీరు ఒప్పుకుంటే కార్డు మంజూరు అవుతుందని చెప్పడంతో సరే అన్న పాపానికి రూ. 99,277 పోగొట్టుకున్న సంఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి బాధితుడు నరేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం 2016లో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కూడా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను నెరవేర్చడానికి ఇబ్బడిముబ్బడిగా మండలాలను ఏర్పాటు చేసుకుంటూ పోయింది. కొన్ని జిల్లాలు ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరికొన్ని జిల్లాలు తక్కువ మండలాలతో పెద్ద పరిపాలన వ్యవస్థను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్ అధికారులను ఆదేశించారు.
నిబంధనల ప్రచారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
ఎండాకాలంతో జూరాల ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో అక్కడి ప్రజలు సాగు, తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తితో కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది.