Share News

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:36 PM

కాంగ్రెస్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే

- నారాయణపేటలో ఎస్‌.రాజేందర్‌రెడ్డి ప్రచారం

నారాయణపేట టౌన్‌, మే 4 : కాంగ్రెస్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం చౌక్‌బజార్‌ నుంచి బస్టాండ్‌ వరకు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాను కేసీఆర్‌ హయాంలో ఏర్పాటు చేశారని, జిల్లాను సీఎం రేవంత్‌రెడ్డి తొలగిస్తామని చెప్పడం బాధగా ఉందన్ననరు. నారాయణపేట జిల్లాగా కొనసాగాలంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని విన్నవించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

నారాయణపేట : కార్యకర్తలకు అండగా ఉంటానని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట 14వ వార్డులో బీఆర్‌ఎస్‌ కార్యకర్త శశికుమార్‌ను పరామర్శించి, యోగ క్షేమాలను తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్‌, మాజీ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కన్నా జగదీష్‌, ప్రతాప్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:36 PM