Share News

ఇచ్చిన హామీలకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

ABN , Publish Date - May 03 , 2024 | 10:49 PM

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం, సాం స్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

 ఇచ్చిన హామీలకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

-మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, మే 3: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం, సాం స్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కొ ల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో ఎంపీ ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రం చేపట్టి సరిగ్గా నాలుగు నెలలు గడవక ముందే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నా యని, బీఆర్‌ఎస్‌ పాలనలో పేద ప్రజలకు చేసిందేమి లేదని జూపల్లి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జూపల్లి ఓటర్లను అభ్యర్థించారు. మునిసిపల్‌ కౌన్సిలర్‌ పిన్నంశెట్టి జ్యోతి, కాంగ్రెస్‌ నాయకులుపాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 10:49 PM