పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యవాదులను గెలిపించాలి
ABN , Publish Date - May 05 , 2024 | 12:39 AM
ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో ఉండే ప్రజాస్వామ్యవాదులను గెలిపించి ఆర్ఎస్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు అన్నారు.
కళ్యాణ్నగర్, మే 4: ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో ఉండే ప్రజాస్వామ్యవాదులను గెలిపించి ఆర్ఎస్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు అన్నారు. శనివారం గోదావరిఖని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జరుగుతున్నాయని, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్ను మన భావి జీవితాలను నిర్ణయించేవి అని, కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ వివిధ రాష్ట్రాల హక్కులపై దాడులు చేశాయని, కార్మికులు, రైతాంగం, దళితులు, ప్రతిపక్షాలు, ముస్లీం మైనార్టీలపై దాడులు కొనసాగించాయని చెప్పారు. హిందుత్వం పేరిట హిందు మత రాజ్యంగా దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రచారం సాగిస్తుందన్నారు. కులం, మతం, భాషల పేరిట ప్రజల మధ్య విద్వే షాలను రెచ్చగొట్టి చీలికలు సృష్టిస్తున్నాయని, సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను వినియోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ ముఖ్యమంత్రులను సైతం అక్రమంగా అరెస్టు చేస్తూ జైల్లో నిర్భంధిస్తున్నారని, చివరికి మీడి యా యాజమాన్యం కూడా గుత్తాధిపత్యం చేస్తున్నారని ఆరోపించారు. 2024ఎన్నికల్లో గెలుపొందడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తుందని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపుని చ్చారు. కే రాజన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎఫ్టీ యూ నాయకులు ఐ కృష్ణ, ఈదునూరి నరేష్, వెంకన్న, అశోక్, చిలుక శంకర్, మల్లేష్, చంద్రయ్య, దుర్గయ్య, పద్మ, రాజన్న, అబెద్నె గో, సుధాకర్, తిరుపతి పాల్గొన్నారు.