TG: మళ్లీ రాష్ట్రానికి అమిత్ షా నేడు ఆదిలాబాద్, ఇందూరు, మల్కాజిగిరిలో బీజేపీ అగ్రనేత ప్రచారం
ABN , Publish Date - May 05 , 2024 | 05:29 AM
బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి తమ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
రేపు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నడ్డా పర్యటన
నేడు అమిత్ షా ప్రచారం
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి తమ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేయనున్నారు. సోమవారం బీజేపీ అధ్యక్షుడు నడ్డా పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు.