Kumaram Bheem Asifabad: క్షణికావేశంతో ఇద్దరు మహిళల బలవన్మరణం
ABN , Publish Date - May 04 , 2024 | 11:17 PM
సిర్పూర్(టి), మే 4: క్షణికావే శంలో ఇద్దరు మహిళలు తీసుకున్న నిర్ణయాలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మండల కేంద్రానికి చెందిన జాజిరెడ్డి రమ్య(32), దోని సరిత(30) ఇద్దరు వివాహితలు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
- భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు
- భరించలేక భార్య ఆత్మహత్య
- అపవాదు భరించలేక మరో మహిత ఆత్మహత్య
సిర్పూర్(టి), మే 4: క్షణికావే శంలో ఇద్దరు మహిళలు తీసుకున్న నిర్ణయాలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. మండల కేంద్రానికి చెందిన జాజిరెడ్డి రమ్య(32), దోని సరిత(30) ఇద్దరు వివాహితలు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏఎస్సై రాములు తెలిపినవివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జాజిరెడ్డి రమ్యకు ఆమె భర్తకు మధ్య తరచూ గొడవలు జరుగుతుం డేవి. ఈ వేధింపులు భరించలేక శుక్రవారం రాత్రి రమ్య పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనిం చిన కటుంబీకులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను అక్కడనుంచి మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అయితే భార్యభర్తల మధ్య జరుగుతున్న గొడవలను ఇరుగుపొరుగు వారికి సరిత చెప్పుతుండడంతోనే అవమానం భరించలేక రమ్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో మనస్థాపా నికి గురైన సరిత శనివారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇద్దరి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.