Share News

Kumaram Bheem Asifabad: విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:15 PM

కాగజ్‌నగర్‌, మే 4: విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని టీఎస్‌ఎన్‌పీడీఎల్‌ వరంగల్‌శాఖ జనరల్‌మేనేజర్‌ గౌతంరెడ్డి అన్నారు. శని వారం ఆయన కాగజ్‌నగర్‌ మండలంలోని ఈసుగాం సబ్‌స్టేషన్‌, గన్నారం ఫీడర్‌తోపాటు పలుచోట్ల ఉన్న విద్యుత్‌సబ్‌స్టేషన్లను పరిశీలించారు.

Kumaram Bheem Asifabad:  విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి

- టీఎస్‌ఎన్‌పీడీఎల్‌ వరంగల్‌శాఖ జనరల్‌మేనేజర్‌ గౌతం రెడ్డి

కాగజ్‌నగర్‌, మే 4: విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని టీఎస్‌ఎన్‌పీడీఎల్‌ వరంగల్‌శాఖ జనరల్‌మేనేజర్‌ గౌతంరెడ్డి అన్నారు. శని వారం ఆయన కాగజ్‌నగర్‌ మండలంలోని ఈసుగాం సబ్‌స్టేషన్‌, గన్నారం ఫీడర్‌తోపాటు పలుచోట్ల ఉన్న విద్యుత్‌సబ్‌స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌సేవలు అందిస్తున్న ఉద్యోగులను, సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట డీఈ నాగరాజు, ఏఈ జగన్‌మోహన్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సత్తన్న, జూనియర్‌ లైన్‌మెన్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:15 PM