Kumaram Bheem Asifabad: అమిత్షా సభకు చురుకుగా ఏర్పాట్లు
ABN , Publish Date - May 04 , 2024 | 11:18 PM
కాగజ్నగర్, మే 4: కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరుగనున్న వికాస సంకల్ప సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్నారు.
-ఎస్పీఎం క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభ
-ఉమ్మడిజిల్లా నుంచి భారీగా తరలిరానున్న కార్యకర్తలు
కాగజ్నగర్, మే 4: కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరుగనున్న వికాస సంకల్ప సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్నారు. మధ్యాహ్నం 1గంటకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభం కానుంది. 2.00గంటలకు హెలిక్యాప్టర్లో అమిత్షా రానున్నారు. సర్సిల్క్ ఏరియాలోని శిశుమందిర్ పాఠశాల, వెల్ఫేర్ గ్రౌండులో రెండు హెలిప్యాడ్ లను ఏర్పాటుచేశారు. ఈప్రాంతాన్ని పూర్తిగా ఎన్ఎస్జీ కమాండోలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఆధీనంలోకి తీసుకుంది. సర్సిల్క్ మార్గం నుంచి ఎస్పీఎం క్రీడా మైదానం వరకు అడుగడుగునా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
- సభను విజయవంతం చేయాలి..
- బీజేపీ జిల్లాఅధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్
ఆదివారం కాగజ్నగర్లో నిర్వహించే వికాస సంకల్ప సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడారు. వికాస సంకల్ప సభకు ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.