అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
ABN , Publish Date - May 04 , 2024 | 12:35 AM
బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది.
నూజివీడు టౌన్, మే 3: బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. పట్టణంలోని శారదానగర్లో ఉంటున్న కొవ్వూరి సాయి యశ్వంత్రెడ్డి (16) తమ నివాస భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఇది గమనించిన బాలుడి తండ్రి రాము రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత భావించినా, మృతుడి బెడ్రూమ్లో రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా మృతుడి తండ్రి నూజివీడు పట్టణంలో ఫర్నిచర్ షాపును నడుపుతున్నాడు. బాలుడు ఇటీవల పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.