Home » Andhra Pradesh » West Godavari
ఓఎన్జీసీ పైప్లైన్ పనులతో నష్టపోయే రైతులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.
బ్రహ్మోత్సవ శోభతో చిన్న వెంకన్న క్షేత్రం వెలుగులు చిమ్ముతోంది.
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్దకు అనుమతి లేని ఏ ఒక్కరికి ప్రవేశం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు.
ముదినేపల్లిలోని ఒక చేపల చెరువు గట్టుపై విద్యుదాఘాతానికి గురై అన్నవరానికి చెందిన బి. బాలసాయి (28) అనే యువకుడు మృతి చెందాడు.
విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నస పెడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ములకు సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో బటన్ నొక్కారు. కానీ విడుదల చేయలేదు. నిధులు కొరత వెంటాడింది.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ విజయవాడలో రూ.1.50 కోట్లు పందేనికి దళారులు కాలుదువ్వారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కొందరు నాయకులు సై అన్నారు.
అసలే వేసవికాలం.. ఉక్కపోత.. ఆపై పడనా వద్దా.. అంటూ చినుకులు పడుతుండ డంతో ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగ స్వాములైన జనసేన, బీజేపీ సైతం నిలదొక్కుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం వల్ల వైసీపీకి గట్టి సవాల్ విసిరాయి. పార్టీ పరంగా, కేడర్ పరంగా తమకున్న బలం, బలహీనతలను ముందుగానే బేరీజు వేసుకుని ప్రధాన భాగస్వామి పక్షమైన తెలుగుదేశం నుంచి పూర్తిస్థాయి ఓట్ల ట్రాన్స్ఫర్ జరిగేలా ఓర్పుగా వ్యవహరించారు.
డయేరియాతో విలవిలాడిన ఆదివాసీ గ్రామాలు కోలుకుంటున్నాయి. కొసాయి గుంపులో గురువారం మూడు కేసులు నమోదు కాగా శుక్రవారం మరో మూడు కేసులు నమోదయ్యాయి. వారిని కూడా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. కురుములతోగుకు చెందిన ఏడుగురు భద్రా చలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వాతావరణం మార్పుతో కురుస్తున్న వర్షానికి చల్ల బడింది. నిన్నటి వరకు ఎండ, వేడితో ప్రజలు అల్లాడారు. ఎండకు జనం బయటకు రావాలంటే భయాందోళన చెందేవారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.